ఐపీఎల్ 2023 : ఫైనల్ మ్యాచ్ కు వెళ్లే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

-

బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ల మధ్యన నిన్న ముగియాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కాస్తా వర్షం కారణంగా ఈరోజుకు వాయిదా పడింది. దీనితో అభిమానులు ఉత్కంఠకు మరో 24 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఇక ఈ రోజు గుజరాత్ లోని అహమ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో మ్యాచ్ జరగనుండగా అందరూ వెళ్లనున్నారు. అయితే నిన్నటి మ్యాచ్ కు టికెట్లు కొనుక్కుని వచ్చిన అభిమానులు విసిగిపోయి టికెట్ లను సైతం చించి వేశారు. కాగా నిన్న రాత్రి బీసీసీఐ ప్రకటనతో మ్యాచ్ రేపు జరుగుతుంది అన్నారు, పైగా పూర్తిగా మాన్యువల్ టికెట్ లు ఉంటేనే అనుమతి లభిస్తుంది అని చెప్పారు. దీనితో చాలా మంది అభిమానులు అయ్యో టికెట్ ను చించేశామని బాధపడ్డారు.

కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టికెట్ ను చించిన పర్వాలేదు అనుమతిస్తాము.. కానీ స్పష్టంగా వివరాలు కనబడాలి అంటూ ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. మరి ఈ రోజు అయినా వర్షం అడ్డంకి లేకుండా మ్యాచ్ సజావుగా సాగుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news