‘తొందరెందుకు.. అప్పుడు చెబుతాగా’.. రిటైర్మెంట్​పై ధోనీ కామెంట్స్

-

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్లోకి చెన్నైసూపర్‌ కింగ్స్‌ అడుగు పెట్టింది. క్వాలిఫయర్‌ -1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్‌కేను కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చపై ధోనీ స్పందించాడు. చెపాక్‌లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కావాల్సినంత సమయం ఉంది. సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. అది జట్టు కోసం ఆడటమా..? బయట కూర్చోవడమా..? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంది’’ అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news