మొహాలీ టెస్: 174 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక… బౌలింగ్ లోనూ సత్తా చాటిన జడేజా

-

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుతున్న తొలి టెస్ట్ లో టీం ఇండియా పట్టుబిగించింది. మూడో రోజు భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. ఒక్కరూ కూడా భారత బౌలింగ్ ముందు నిలువలేకపోయారు. కేవలం 174 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా రవీంద్ర జడేజా సత్తా చాటాడు. భారత్ కన్నా 400 పరుగులు వెనకబడి ఉన్నారు. ఫాలో ఆన్ ఆడక తప్పని పరిస్థితి శ్రీలంకది. శ్రీలంక బ్యాటర్లలో ఓ నిస్సంక తప్పితే… ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలబడ లేకపోయారు. చివరి నలుగురు బ్యాటర్లు లక్మల్, ఎంబుల్డేనియా, విశ్వ ఫెర్నాండో , లహిరు కుమారాలు డకౌట్ గా వెనుదిరిగారు. కేవలం 13 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికేట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా 5 వికేట్లు, అశ్విన్, బూమ్రాలు తలో రెండు వికెట్లు, షమి ఒక వికెట్ తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఫాలో ఆన్ అడుతున్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడుతోంది కేవలం 19 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయారు. తిరుమన్నే డకౌట్ గా వెనుదిరిగాడు. క్రీజ్ లో కరుణ రత్నే, నిస్సంక ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news