‘బౌలింగ్ మనేయాలా’ అంటూ.. క్రికెటర్ అశ్విన్ సంచలన ట్వీట్

-

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్​-ఆసీస్​ మధ్య జరిగిన ఆఖరి నాలుగో టెస్టు మ్యాచ్​ డ్రాగా ముగిసింది. మూడు రోజుల ఆట పూర్తయ్యే సమయానికి ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అర్థమైపోయింది. ఇలాంటి సమయాల్లో సాధారణంగా కెప్టెన్లు ప్రయోగాలు చేస్తుంటారు. టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ కూడా ఓ ప్రయోగం చేశాడు. ఎప్పుడూ బ్యాటింగ్ చేసే పుజారాతో బౌలింగ్ చేయించాడు. అలాగే యంగ్ ప్లేయర్ శుభమన్​ గిల్​తో కూడా బంతిని వేయించాడు.

తాజాగా పుజారా బౌలింగ్ చేయడంపై స్పందించాడు టీమ్​ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. “నువ్వు బౌలింగ్ చేస్తే నేనేం చెయ్యాలి? బౌలింగ్ మానేయాలా?” అంటూ సరదాగా చమత్కరించాడు. ఫన్నీగా చేసిన ఈ ట్వీట్​ వైరల్ అవుతోంది.

అశ్విని ట్వీట్​కు పుజారా స్పందిస్తూ.. ‘వద్దు నాగ్​పుర్ టెస్టులో నువ్వు వన్​ డౌన్​లో వెళ్లినందుకు నేను ఇలా థ్యాంక్స్ చెబుతున్నా’ అని పుజారా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్​కు స్పందిస్తూ.. అశ్విన్ ‘నీ ఉద్దేశం బాగానే ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక వీరిద్దరి సంభాషణ ఇప్పుడు ట్విటర్​లో వైరల్​గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news