రాహుల్ ఔట్.. టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌..!

-

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన టీమ్ ​ఇండియా ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్​ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు.

నవంబర్‌ 18న వెల్లింగ్టన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన షురూ కానుంది. ఈ పర్యటనకు టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్​ మరోసారి భారత తాత్కాలిక హెడ్​కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్​దీప్​ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్​ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్​దీప్ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

Read more RELATED
Recommended to you

Latest news