IND vs NZ: మలుపుతిప్పిన శార్దూల్, ఉమ్రాన్.. భారత్ ఘన విజయం! సిరీస్ క్లీన్ స్వీప్!

-

టీమిండియా మరో విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో కివీస్ నుంచి వన్డేల్లో అగ్రస్థానాన్ని సైతం టీమిండియా చేజిక్కించుకుంది.

ఇండోర్ వన్డేలో రోహిత్ గిల్ సెంచరీలు చేయడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టును భారత బౌలర్లు 295 పరుగులకే పరిమితం చేశారు. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ లోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిన్ అలెన్ ను బౌల్డ్ చేశాడు. ఇక టీమిండియా బౌలర్లు రాణించడంతో.. గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news