గాయం నుంచి కోలుకుంటున్న జడేజా.. ఫోటో వైరల్

-

ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ తో జరిగిన గ్రూప్ ప్రారంభ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హాంకాంగ్ పైన మ్యాచ్ ఆడాడు. అయితే ఆ తర్వాత అనుకోని గాయంతో సూపర్ ఫోర్ రౌండ్ నుంచి జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దుబాయ్ లో వారు విడిది చేసిన స్టార్ హోటల్ బ్యాక్ వాటర్స్ లో స్కీబోర్డ్ గేమ్ ఆడుతూ జడేజా జారి పడటంతో మోకాలికి గాయమైంది. దీంతో ముంబైకి జడేజా ని హుటా హుటిన తరలించి శస్త్ర చికిత్స నిర్వహించారు.

ఈ గాయంతో త్వరలో జరగనున్న టి20 వరల్డ్ కప్ కు కూడా జడేజా దూరమైన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసిన జడేజా.. తాజాగా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నట్టుగా ప్రకటించాడు. ఇంటిలో గాయం నుంచి కోలుకుంటున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం జడేజా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news