IPL 2023 : ఐపీఎల్ లో 2 సరికొత్త రికార్డులు సృష్టించిన కోహ్లీ

-

IPL 2023 : నిన్న ముంబై జట్టుపై బెంగుళూరు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ లో 2 సరికొత్త రికార్డులు సృష్టించారు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఊపు కొనసాగించాడు. 6 ఫోర్లు, 5 సిక్స్ లతో ఏకంగా 82 పరుగులు చేసి వావ్ అనిపించారు.

ఎనిమిది టికెట్ల తేడాతో ఆర్సిబిని తొలి మ్యాచ్ లో గెలిపించాడు. ఈ క్రమంలోనే తన పేరిట కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ పోరులో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ ఐపిఎల్ లో 50వ అర్థ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ మార్కుని అందుకున్న తొలి భారత క్రికెట ర్ గా నిలిచాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 45 హాఫ్ సెంచరీలతో పాటు ఐదు సెంచరీలు చేశాడు. ఇతడి కంటే ముందు వార్నర్ 60 హాఫ్ సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news