ముంబయి ఇండియన్స్​ నుంచి పొలార్డ్‌ ఔట్‌ !

-

ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్‌ ఊహించని షాక్‌ తగిలింది. టీ 20 లీగ్ లో ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు రానున్న సీజన్ కు ఓ కీలక ఆటగాడిని వదులుకున్నాయి. ఈ క్రమంలో ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ని ముంబై ఫ్రాంచైజీ రిలీజ్ చేసినట్లు సమాచారం.

భారత టి20 లీగ్ 2023 సీజన్ కోసం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. ఫ్రాంచైజీలు తాము రిలీజ్ చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాలని బీసీసీఐ సూచించింది. దీంతో ఫ్రాంచైజీలు తాము వదిలేసుకుంటున్న ప్లేయర్స్ లిస్టును ప్రకటిస్తున్నాయి. భారత టి20 లీగ్ లో రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు, 2023 సీజన్ కి ముందు కీలక ఆటగాడిని వదులుకున్నట్లు  తెలు స్తోంది. 2010 నుంచి జట్టులో ఉన్న ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ని ముంబై ఫ్రాంచైజీ రిలీజ్ చేసిం దని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news