ఓ శకం ముగిసింది… కన్నీళ్లతో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ వీడ్కోలు..

-

రోజర్ ఫెదరర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. రోజర్ ఫెదరర్ శకం ముగిసింది. తన కెరీర్ లో చిట్టచివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో ముగింపు పలికాడు. తన చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ తో కలిసి ఆడిన డబుల్సులో పరాజయాన్ని చవిచూశాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన కెరీర్ కు ముగింపు పలికినట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఆ సమయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. ఫెదరర్ అతన్ని ఈ స్థితిలో చూసిన రఫెల్ నాదల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. లండన్ లో జరిగిన డబుల్సు మ్యాచ్ లో నాదల్-ఫెదరర్ జోడి పై జాక్ సాక్-ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది.

రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ బ్లూ కలర్ టీషర్ట్, వైట్ కలర్ షాట్స్ ధరించి, కోర్టులోకి అడిగిపెట్టిన వెంటనే ప్రేక్షకులు లేచి నిల్చోని స్వాగతం పలికారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. లెట్స్ గో రోజర్, లెట్స్ గో అంటూ నినందించారు. ఈ మ్యాచ్ ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయారు టెన్నిస్ దిగ్గజాలు. ఓటమిని చవిచూశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ తన టీం తో పాటు ఇతర ప్లేయర్లతో కరచాలనం చేశాడు. భావోద్వేగానికి గురయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news