IND VS SA : టీమిండియాలోకి RCB ఆల్ రౌండర్ ఎంట్రీ !

-

IND VS SA : రాబోయే టి20 వరల్డ్ కప్ కు ముందు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టి20 ల సిరీస్ ను 2-1 తో గెలిచిన టీమిండియా, సౌత్ ఆఫ్రికా తో సమరానికి సిద్ధమవుతోంది. బుధవారం తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

అయితే.. ఈ సిరీస్‌ నేపథ్యంలో RCB స్పిన్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. వర్క్ లోడ్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా సిరీస్ కు దూరమైన పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియా పిలుపును అందుకున్నాడు. అయితే షాబాజ్ అహ్మద్ ఎంపికను డిసిసిఐ ధ్రువీకరించాల్సి ఉంది.

మరోవైపు వెన్ను గాయంతో బాధపడుతున్న దీపక్ హుడా, కరోనా నుంచి కోలుకొని మహమ్మద్ షమీ ఈ సిరీస్ కు దూరమయ్యారు. షమీ స్థానంలో ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికైన మహమ్మద్ షమీ, సౌత్ ఆఫ్రికా తో సిరీస్ కు కూడా కొనసాగనుండగా, దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటిఐ ఓ కథనాన్ని ప్రచురించింది. షాబాజ్ అహ్మద్, శ్రేయస్ అయ్యర్ లను జట్టులోకి తీసుకురావాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు ఓ బిసిసిఐ అధికారి పేర్కొన్నాడని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news