సానియాతో విడాకులు.. పుకార్లపై తొలిసారి స్పందించిన షోయబ్ మాలిక్

-

భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లకు ఊతమిస్తూ వీరి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు.. ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి రాకపోవడం.. సానియా మీర్జా రిటైర్మెంట్ ఈవెంట్​లో షోయబ్​ మాలిక్ కనిపించకపోవడంతో రూమర్స్ నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయంపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే తొలిసారిగా షోయబ్ విడాకుల పుకార్లపై పరోక్షంగా మాట్లాడాడు.

భార్య సానియామీర్జాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని షోయబ్‌ మాలిక్‌ అన్నాడు. ‘‘సానియాతో కలిసి ఉండేందుకు ప్రొఫెషనల్‌ ఒప్పందాల వల్ల వీలు దొరకట్లేదు. దీని వల్లే ఇటీవల ఈద్‌కు కూడా కలవలేదు. మా ఇద్దరిలో ఎవరికి సమయం చిక్కినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటాము. భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు మెరుగవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా ఐసీసీ దృష్టిలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచే పెద్దది. భారత్‌-పాక్‌ ఆటగాళ్లే కాదు.. వేరే దేశాల అభిమానులు కూడా ఈ రెండు జట్లు తలపడాలని కోరుకుంటారు’’ అని షోయబ్‌ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news