టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్న శ్రీలంక స్టార్ ఆటగాడు..!

-

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్ ని మాత్రమే కొనసాగించడానికి వీలుగా టెస్ట్ ఫార్మాట్ కి వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 2020లో సుదీర్ఘ ఫార్మాట్ లోకి ఆరంగేట్రం చేసిన హసరంగ కేవలం నాలుగు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తన రిటైర్మెంట్ నిర్ణయానికి ఇప్పటికే శ్రీలంక బోర్డుకు తెలియజేశాడు.

అదేవిధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా హసరంగ రిటైర్మెంట్ కి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తాజాగా శ్రీలంక బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. “శ్రీలంక ఆల్ రౌండర్ వనింధు హసరంగ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్ ను పొడగించడానికి అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బోర్డు కూడా ఆమోదం తెలిపింది అని సీఈవో ఆప్లే డిసిల్వా తెలిపారు. హసరంగా ఇప్పటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో హసరంగ కీలకం అవుతాడని శ్రీలంక అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news