Suresh Raina: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్ !

-

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్ రైనా సంచలన నిర్నయం తీసుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌ కు పూర్తిగా గుడ్‌ బాయ్‌ చెప్పేందుకు సురైష్‌ రైనా సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్‌ తో పాటుగా భారత టి20 లీగ్ మరియు దేశంలోని ఇతర దేశవాళీ పోటీల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట సురేష్‌ రైనా.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాడట రైనా. అంతేకాదు…సురేశ్ రైనా… ఇప్పుడు UAE మరియు దక్షిణాఫ్రికా T20 లీగ్‌లలో ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. UAE మరియు దక్షిణాఫ్రికా T20 లీగ్‌లలో ఆడాలని అనుకునే ప్లేయర్లు.. ఐపీఎల్‌ మరియు ఇండియాలోని దేశవాళీ క్రీడాలు ఆడకూడదు.. దీంతో రైనా ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతోంది. కాగా.. ఐపీఎల్‌ 2022 వేలంలో సురేష్‌ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో రైనాకు చేధు అనుభవం ఎదురైంది. కాగా… ఐపీఎల్ లో 205 గేమ్స్ ఆడిన రైనా, 5వేల 528 పరుగులు చేయగా, అందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news