బెంగళూరును ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్

-

నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ… ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించింది. 224 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలర్ తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తారా నోరిస్ అమెరికాకు చెందిన క్రికెటర్. పరుగులు చేశారు. కాగా… నేటి రెండో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్ కు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 143 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో గెలిచితీరాలన్న కృతనిశ్చయంతో గుజరాత్ జట్టు బరిలో దిగుతోంది. డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో తన ప్రస్థానం ఆరంభించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version