Asia cup 2022 : ఇలా చేస్తే.. ఇండియా – పాక్ మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చు !

-

ASIA CUP 2022 : ఆసియా కప్‌ సూపర్‌ 4 లో భాగంగా ఇవాళ.. భాగంగా టీమిండియాతో పాక్‌ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా… దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది రెండో మ్యాచ్.

శనివారం రాత్రి జరిగిన తొలిగేమ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. దీని వెబ్సైట్ కూడా మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అవన్నీ పెయిడ్ చానల్స్. ఉచితంగా చూడటానికి అవకాశం ఉంది.

దూరదర్శన్ లో ఈ సౌకర్యాన్ని కల్పించింది. డిడి స్పోర్ట్స్ ఛానల్ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. నిజానికి ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ను డిడి స్పోర్ట్స్ ఛానల్ మొదటినుంచి ప్రత్యక్ష ప్రసారం చేయట్లేదు. ఈ టోర్నమెంట్ లో ఇకపై జరిగే మ్యాచ్ లు కూడా ఈ ఛానల్ లో లైవ్ టెలికాస్ట్ కాబోవు గాని, సూపర్-4 దశలో భారత్ ఆడే మ్యాచ్లను మాత్రమే డిడి స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకొని రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news