ఐపీఎల్ 2023: మ్యాచ్ ఓడినా.. SRH బౌలర్ భువనేశ్వర్ భలే రికార్డ్ పట్టేశాడుగా !

-

గత రాత్రి ముగిసిన హైద్రాబాద్ మరియు గుజరాత్ మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో హార్దిక్ పాండ్య జట్టు గెలిచి ప్లే ఆప్స్ కు చేరిన మొదటి జట్టుగా అవతరించింది. అన్ని విభాగాలలో అద్భుతంగా రాణించిన గుజరాత్ మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఈ ఐపీఎల్ సీజన్ లో SRH పనైపోయింది. ఏదో కొద్దిపాటి ఆశలు ఉన్నా .. ఈ మ్యాచ్ లో ఓటమితో అవి కూడా పోయాయి. ఐపీఎల్ నుండి నిష్క్రమించిన రెండవ జట్టుగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో SRH బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఓడినా ఒక రికార్డును సృష్టించాడు. ఇంతవరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో ఒకే మ్యాచ్ లో ఒక ప్లేయర్ అయిదు వికెట్లు మరియు 25 పరుగుల కన్నా ఎక్కువ చేసిన ఘనతను అందుకున్నాడు.

అయితే ఇంతకు ముందు ఈ రికార్డును గతంలో చెన్నై తరపున ఆడిన రవీంద్ర జడేజా డెక్కన్ ఛార్జర్స్ పై 48 పరుగులు మరియు 5 వికెట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును భువి అందుకోవడంతో రెండవ బౌలర్ గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news