రజనీ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్.. ఎవరంటే?

-

ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 1970ల కాలంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే శ్రీదేవి.. రజనీకాంత్‌ కంటే ఎక్కవగా పారితోషికం తీసుకున్నారట.

అలనాటి అందాల తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 1970ల కాలంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే శ్రీదేవి.. రజనీకాంత్‌ కంటే ఎక్కవగా పారితోషికం తీసుకున్నారట. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1970లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కె.బాలచందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్‌ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్‌ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట.

అప్పట్లో కమల్‌హాసన్‌ పేరున్న నటుడు కాబట్టి వారికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు.కాగా, ప్రస్తుతం రజనీకాంత్​ సినిమాల విషయానికొస్తే.. ఆయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కమల్​హాసన్​ ఇటీవలే విక్రమ్​ చిత్రంతో బ్లాక్​బస్టర్​ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news