పూజా హెగ్డే అలా మాట్లాడుతుందంటూ ప‌రువు తీసేసిన థ‌మ‌న్

-

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం మోస్ట్ స‌క్సస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. ఎస్ ఎస్ థ‌మ‌న్ అని ట‌క్కున చెబుతారు. ఎందుకంటే.. ఇటీవ‌ల ఆయ‌న సినిమా చేసిన సినిమాలు అఖండ‌, పుష్ప పార్ట్ 1, రాధేశ్యామ్.. వ‌రుస‌గా మూడు సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అందుకున్నాయి. అందులోనూ థ‌మ‌న్.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రం ప‌గిలిపోయింద‌నే చెప్పాలి. కాగ థ‌మ‌న్ ఇటీవ‌ల రాధేశ్యామ్ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. కాగ రాధేశ్యామ్ మొద‌ట్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. క‌లెక్షన్ల ప‌రంగా దూసుకుపోతుంది.

ఇప్ప‌టికే ఈ సినిమా రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంద‌ని ట్రెడ్ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో రాధేశ్యామ్ చిత్ర బృందం స‌క్సస్ సెల‌బ్రెట్ మూడ్ లో ఉంది. చిత్ర బృందం వ‌రుస‌గా ప్రెస్ మీట్లు పెడుతూ త‌మ విజ‌యాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. కాగ ఇటీవ‌ల జ‌రిగిన ఒక ప్రెస్ మీట్ కు డైరెక్ట‌ర్ రాధ‌కృష్ణ‌తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ థ‌మ‌న్ వ‌చ్చారు. ఈ ప్రెస్ మీట్ లో థ‌మ‌న్ .. హీరోయిన్ పూజా గురించి చెబుతూ.. ప‌రువు మొత్తం తీసేసాడు.

ఎవ‌రైనా ముద్దు ముద్దుగా మాట్లాడుతారు.. కానీ పూజా మాత్రం ముద్ద ముద్ద‌గా మాట్లాడుతుంద‌ని గాలి తీశాడు. కాగ రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే.. సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది. తెలుగు స‌రిగ్గా రాని పూజా తెలుగులో డైలాగ్స్ చెప్ప‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డ‌ద‌ని తెలుస్తుంది. సినిమాలో కూడా పూజా డైలాగ్స్.. చూస్తేనే అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news