కేసీఆర్‌ సంచలన నిర్ణయం..తెలంగాణలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. తెలుగు ఇంగ్లీష్ రెండు భాషలలో బోధనా జరిగేలా చర్యలు చేపట్టామని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లో 50శాతం దళితులకు అవకాశం కల్పించామన్నారు.

స్వాతంత్ర వచ్చి 75ఎండ్లు అయినా కొన్ని గ్రామాల్లో అంబెడ్కర్ విగ్రహాలు లేవు , త్వరలోనే ఆని గ్రామాల్లో అంబెడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలన్నారు.

అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలని… అంబేద్కర్ ఇచిన్న స్ఫూర్తినీ తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని వెల్లడించారు. పేదరికం వల్లనే మనుషుల్లో తేడా వచ్చిందని… పేదరికాన్ని రూపు మపాలని కెసిఆర్ దళిత బంధు పథకం తెచ్చాడన్నారు. విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్ లలో కూడా రిజర్వేషన్ తెచ్చామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news