బ్రేకింగ్ : శ‌బ‌రిమ‌ల‌లో భ‌క్తులకు ద‌ర్శనాలు నిలిపివేత‌…

-

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా… కేరళ రాష్ట్రం లో…. భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ కార్డు భారీ వర్షాల కారణంగా శబరిమలకు భక్తుల రాక ను నిలిపివేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరి ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న పంబానది భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

అలాగే కల్కి – ఆందోళన రిజర్వాయర్ కూడా భారీ వరదలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే భక్తులను శబరిమలకు అనుమతి ఇవ్వకూడదని ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద తగ్గిన తర్వాత ఆన్లైన్లో దర్శనాలకు అనుమతి ఉంటుందని… అప్పటి వరకు భక్తులు వేచి ఉండాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు కలెక్టర్. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో… భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.  మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news