బాబుకి కొత్త టెన్షన్.. కొత్త కేసు వేస్తున్న సుబ్రమణ్య స్వామి

-

టిటిడి పై దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై కేసు వేస్తున్నట్లు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చిన సుబ్రమణ్య స్వామికి బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకన్న మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై తిరుపతి కోర్టు నందు కేసు వేయడానికి వచ్చినట్లు తెలిపారు.

అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల పై ప్రభుత్వ ఆధిపత్యం నుంచి తొలగించాలని కోరుతూ తిరుపతి నుంచి విజయవాడ కెళ్ళి హై కోర్టు కేసులు చేస్తున్నట్లు చెప్పారు. సాధువులు స్వామీజీ లే దేవాలయ నిర్వహణ చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే తమిళనాడులో ఇలానే కేసు వేసి నటరాజ స్వామి దేవస్థానం పై అక్కడి ప్రభుత్వ ఆధిపత్యం నుంచి తొలగించామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news