నేటి నుంచి తమిళనాడులో పూర్తి స్థాయి లాక్ డౌన్ !

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోంది. రోజు రోజు కు ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రతి రోజు లక్ష కు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే… తమిళనాడు ప్రతి ఆదివారం లాక్‌ డౌన్‌ ను విధించాలని నిర్ణయం తీసుకుంది. స్టాలిన్‌ సర్కార్‌ నిర్ణయం మేరకు ఇవాళ్టి ఆదివారం నుంచే ఈ లాక్‌ డౌన్‌ నిబంధన అమలులోకి రానుంది. తమిళ నాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు అంతటా నైట్‌ కర్ఫ్యూ విధించింది సర్కార్‌. దీంతో అన్ని రోజులలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కేవలం అత్యవసరమైన కార్యకలాపాలకు మాత్రం స్టాలిన్‌ సర్కార్‌ అనుమతులు ఇచ్చింది. ప్రజలు కూడా మాస్కులు లేకుండా తిరగవద్దని ఆదేశించిందిద.

Read more RELATED
Recommended to you

Latest news