కొత్త జెర్సీతో బరిలోకి సన్‌రైజర్స్‌.. ఈసారైనా కలిసోచ్చేనా..?

-

ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీతో కొత్త సీజన్ లో అడుగుపెట్టబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం (మార్చి 16) కొత్త జెర్సీ లాంచ్ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌ కొత్త జెర్సీతో ఉన్న వీడియోను ట్విట్టర్‌ లో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ జెర్సీలో పెద్దగా మార్పులు చేయలేదు. సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీని పోలినట్టుగా భుజాలు, చేతులపై నల్ల రంగు ఉంచింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు అతనే ట్రోఫీ అందించాడు. కాగా, ఈ నెల 31న మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్‌ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ ను ఏప్రిల్‌ 2న హైదరాబాద్‌ వేదికగా రాజస్థాన్‌తో తలపడనున్నది. కాగా, కొన్నేళ్లుగా సన్ రైజర్స్ ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. గత సీజన్‌లో కేవలం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త జెర్సీలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news