సూపర్​స్టార్​ కృష్ణకు నచ్చిన ఈ తరం హీరో ఎవరో తెలుసా?

-

తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి. హేమహేమీలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేసిన ఘనుడు లెజెండరీ హీరో కృష్ణ. అలానే ఆయన తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్​బాబు కూడా సూపర్​స్టార్​గా ఎదిగి కెరీర్​లో​​ దూసుకెళ్తున్నారు. విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఆయన​ నటనను చూసి కృష్ణ ఎప్పుడూ మురిసిపోతుంటారు. అయితే మహేశ్​ కాకుండా ఈ తరం హీరోల్లో తనకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలిపారు కృష్ణ. ఆ సంగతులు ఏంటో చూద్దాం

ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్​, ఎన్టీఆర్​, అల్లుఅర్జున్​, రామ్​చరణ్​.. వీరిలో ఎవరంటే ఇష్టమని అడగగా.. జానియర్​ ఎన్టీఆర్​ అని టక్కున చెప్పారు సూపర్​స్టార్​. మంచి నటుడని కితాబిచ్చారు. అలానే సీనియర్​ ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ వైరల్​ అవుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు మూవీ సమయంలో తనకు, సీనియర్​ ఎన్టీఆర్​కు మధ్య దాదాపు పదేళ్ల పాటు మాటలు లేవని తెలిపారు.

“నేను అల్లూరి సినిమా తీసిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఆ చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. అందుకోసం పరుచూరి బ్రదర్స్​ను కథ రాయమని అడిగారు. అయితే పరుచూరి బ్రదర్స్​.. కృష్ణ అల్లూరి సినిమా చూశారా అని అడిగారట. అప్పుడు ఎన్టీఆర్​ చూడలేదు అంటే.. ఓ సారి చూడండి అని సలహా ఇచ్చారట. అప్పటికే నాకు ఎన్టీఆర్​కు దాదాపుగా పదేళ్లు మాటల్లేవు. ఒకరోజు అనుకోకుండా స్టూడియోలో ఎదురుపడ్డాం. ‘బ్రదర్ ఇలా రండి’ అని నన్ను పిలిచారు. ఏంటి అని అడిగితే మీ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చూడాలనుకుంటున్నా. మీరే దగ్గరుండి చూపించాలి అని అడిగారు. వెంటనే ప్రింట్ తెప్పించి పక్కనే కూర్చుని చూపించా. ఇంటర్వెల్​కే అద్భుతంగా ఉందని అన్నారు. ఇక సినిమా మొత్తం అయిపోయాక నన్ను కౌగిలించుకుని ప్రశంసించారు. ఈ సినిమాని ఇంతకంటే బాగా ఎవరూ తీయలేరు అని కితాబిచ్చారు.” అని కృష్ణ గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news