చంద్రబాబు ఆస్తులపై పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం కోర్టు

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైకాపా నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 

హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news