తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి : సురేష్‌ బాబు

-

కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ సినిమాల విడుదలకు సంబంధించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఇటీవలే ఒక లేఖను కూడా విడుదల చేసింది. దీనికి కారణం దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడును సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించడం. దీంతోపాటు థియేటర్ల ఓనర్లతో ముందుగానే అగ్రిమెంటు కూడా చేసుకున్నారు. అయితే.. తాజాగా
నారప్ప చిత్రాన్ని థియేటర్​లో విడుదల చేసే విషయమై ఆ చిత్ర నిర్మాత సురేశ్​ బాబు కీలక కామెంట్స్ చేశారు.

అలాగే సంక్రాంతికి రిలీజయ్యే సినిమా ల గురించి కుడా స్పందించారు.. విక్టరీ వెంకటేశ్ అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ 13న ఒక రోజు నారప్ప చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సురేశ్​ బాబు వెల్లడించారు. కరోనా కారణంగా నారప్పను థియేటర్ లో విడుదల చేయలేకపోయామని తెలిపిన సురేశ్​ బాబు…. అమెజాన్ ఓటీటీ సంస్థను ఒప్పించి వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న నారప్పను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ షో ద్వారా వచ్చే నగదును ఒక మంచి కార్యక్రమం కోసం ఉపయోగించనున్నట్లు సురేశ్​ బాబు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సురేశ్​ ప్రొడక్షన్స్ లోనే వెంకటేశ్, రానా సినిమాలు నిర్మాణం జరుపుకుంటాయని సురేశ్​ బాబు వెల్లడించారు.

Suresh Babu's Disputing Statements With AP Govt On Ticket Issue

దీంతో పాటే సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై జరుగుతున్న వివాదం గురించి సురేశ్ మాట్లాడినట్లు తెలిసింది. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని అన్నారట. సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు నడుస్తాయని చెప్పినట్లు తెలిసింది. “తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాగోకపోతే తర్వాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్‌ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్‌ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలై విజయం సాధిస్తున్నాయి” అని అన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news