సుశాంత్ ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టు.. బయటపడ్డ అసలు నిజం..!

-

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. ముందుగా ఇది ఆత్మహత్య పోలీసులు తేల్చినా.. రెండు మూడు రోజుల తర్వాత మాత్రం అది ముమ్మాటికీ హత్యే అంటూ ఆయన మామ సహా పలువురు అనుమానాలు రేకెత్తించారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు చివరికి ఈయనది ఆత్మహత్య అని తేల్చారు. తాజాగా ఆయన పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది.

ఈ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ కేవలం ఉరి వేసుకోవడం వల్లే ఊపిరాడక మరణించాడని, ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని తేలింది. అంతేకాదు ఆయన మరణం అనుమానాస్పద రీతిలో ఏం జరగలేదని, పైగా చనిపోయినపుడు అతడి శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని పోస్ట్‌మార్టం తుది నివేదికలో వెల్లడైంది. అప్పటికే సుశాంత్ మరణానికి సంబంధించి కుటుంబం, స్నేహితులు, పాత మేనేజర్, టీమ్ సభ్యులు, హౌస్ స్టాఫ్, ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు 23 మంది వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news