ట్రెండ్ ఇన్: మహేశ్ నోట జగన్ మాట..సమ్మర్ బ్లాక్ బాస్టర్ ‘సర్కారు వారి పాట’!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఈ ట్రైలర్ చూసి మహేశ్-కృష్ణ అశేష అభిమానులు, సినీ అవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మెంటల్ స్వాగ్ లో మహేశ్ అదరగొడుతున్నాడని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా ‘సర్కారు వారి పాట’ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ చిత్రానికి అనుకున్న స్థాయిలో స్పందన లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న విడుదల కానున్న మహేశ్ పిక్చర్ బాక్సాఫీసును షేక్ చేస్తుందని అంటున్నారు మహేశ్ అభిమానులు. ఈ సారి కూడా మహేశ్ బాబు బాక్సాఫీసు నుంచి భారీ మొత్తంలో డబ్బులు రికవరీ చేస్తాడని చెప్తున్నారు ఫ్యాన్స్.

మహేశ్ చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ప్రేక్షకులకు కనిపించాడు. ఆ సినిమా తర్వాత కనిపించనే లేదు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ లో మహేశ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఈ మూవీ స్టోరి, యాక్షన్ సీన్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయన్న సంగతి ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ పిక్చర్ ట్రైలర్ విడుదలైన సందర్భంగా మహేశ్ అభిమానులు #SVPTrailer హ్యాష్ ట్యాగ్ ఎస్ వీ పీ ట్రైలర్, #Mahesh Babu హ్యాష్ ట్యాగ్ మహేశ్ బాబు పేరిట ట్వీట్స్ చేస్తున్నారు.

అలా అభిమానుల వరుస ట్వీ్ట్స్ తో సదరు హ్యాష్ ట్యాగ్స్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేశ్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేశ్ ‘కళావతి’గా నటించింది. ఇక ట్రైలర్ లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన మాటలు ‘‘నేను విన్నాను నేను ఉన్నాను’’ అనే డైలాగ్స్ ..మహేశ్ బాబు నోట..సినిమాలోని సీన్ కు తగ్గట్లు..కీర్తి సురేశ్ ను కౌగిలించుకుని చెప్పడం విని సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news