T20 World Cup 2022 : మొదటి వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. మళ్లీ ఫెయిల్ అయిన రాహుల్

-

ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా నేడు టీమిండియా, నెదర్లాండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సిడ్నీ నగరంలోని సిడ్నీ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయంతీసుకుంది. దీంతో నెదర్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.

ఓపినర్ కేఎల్ రాహుల్ (9) పరుగుల వద్ద మరోసారి ఫెయిల్ అయి వెనుతిరిగాడు. మొదటి ఓవర్ లోనే పాల్ వాన్ మీకేరన్, కేఎల్ రాహుల్ వికెట్ తీసి భారత జట్టును దెబ్బ కొట్టాడు. ప్రస్తుతం మరో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ను గాడిన పెట్టడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (14) పరుగుల వద్ద క్రీజ్ లో ఆడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news