టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడేవి ఈ రెండు జట్లేనా… ? బెన్ స్టోక్ జోస్యం

-

టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ లవర్స్ కు ఫుల్ వినోదాన్ని పంచుతోంది. అయితే ఈ సారి క్రికెట్ అభిమానులను మాత్రం ఒక ప్రశ్న వేధిస్తోంది. ఫైనల్లో ఏఏ జట్లు తలపడుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి కొన్ని మ్యాచులే జరిగినా, ఆటతీరును బట్టి కొన్ని జట్లు ఫైనల్ కు చేరుతాయని అంచానా వేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ మాత్రం ఫైనల్లో తలపడేది ఇంగ్లాండ్, పాకిస్థానేనా ..? అని ట్విట్టర్ వేదికగా కొత్త ప్రశ్నను లేవనెత్తాడు. ప్రస్తుతం జరుగుతున్న పురుషుల టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉందని బెన్ స్టోక్స్ జోస్యం చెప్పాడు. నిన్న ఆప్గనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ 5వికేట్ల తేడాతో గెలుపొందిన తర్వాత స్టోక్స్ ఈ ట్విట్ చేశాడు. హాట్ ఫెవరెట్ గా ఉన్న ఇండియాను మొదటి మ్యాచ్ లో 10 వికేట్ల తేడాతో ఓడించిన తర్వాత వరసగా న్యూజిలాండ్, ఆప్గనిస్థాన్ జట్లను ఓడించి గ్రూపులో ఫస్ట్ ప్లేసులో ఉంది. బాబార్ ఆజాం నాయకత్వంలో పాక్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫిల్డింగుల్లో తిరుగు లేకుండా ఉంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని జట్టు శనివారం సాయంత్రం ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది

Read more RELATED
Recommended to you

Latest news