విజయశాంతిని బుజ్జగించడానికి రంగంలో ఠాగూర్ !

-

విజయశాంతి బీజేపీలో చేరికపై జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ నేతలు ఆమెతో కొద్ది రోజులుగా టచ్ లో ఉన్నారని ఇక ఆమె పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. అయితే విజయశాంతి బీజేపీ ముఖ్యనాయకులతో చర్చలు జరుపుతున్నారనే విషయం తెలియగానే అలెర్ట్ అయిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ను ఆమె వద్దకు చర్చలకు పంపింది. కానీ, విజయశాంతి మాత్రం కాంగ్రెస్ ముఖ్య నాయకుల వ్యవహార శైలి విషయంలో సుముకంగా లేరని అంటున్నారు.

అదీ కాక నిన్న బీజీపీలో విజయశాంతి చేరికపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ రాములమ్మను పొగడ్తలతో ముంచెత్తాడు. దీంతో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేని కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విజయశాంతితో కొత్తగా తెలంగాణాకు నియమితులు అయిన ఠాగూర్ భేటీ అయినట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు ఎవరులేకుండానే విజయశాంతితో ఠాగూర్ ఒక్కరే భేటీ అయినట్టు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం భట్టి ఇంట్లో భోజనం తర్వాత నేరుగా విజయశాంతి ఇంటికి ఠాగూర్ వెళ్ళారని అంటున్నారు. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news