బ్రేకింగ్‌ : వారికి తెలంగాణ సర్కార్‌ షాక్..

-

కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్‌ సేప్టీ సెస్‌ను విధించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనంపైనా ఈ సెస్‌ను వసూలు చేయనుంది. మోటారు సైకిల్‌, స్కూటర్‌, మోపెడ్‌ వంటి వాటికి రూ.500, కార్లకు రూ.2000, వాణిజ్య రంగ వాహనాలకు రూ.2500 దాకా రోడ్‌సేఫ్టీ సెస్‌ కింద వసూలు చేయనున్నారు. అంటే ప్రతీ వాహనంపైనా రూ. 500 నుంచి రూ. 2500 వరకు పెరిగినట్లయింది. అయితే ఇదే తొలి పెంపు కాదు. వారం రోజుల కిందట వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, త్రైమాసిక ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది.

అన్ని రకాల వాహనాలపై విధించే జీవితకాల పన్నును వారం క్రితం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా కొనే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్‌ ట్యాక్స్‌ ఆ వాహనం ధరపై ఇప్పటి వరకు 9 శాతం ఉండగా.. ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయించారు. నిజానికి ఇప్పుడు రూ. 50 వేలకు వచ్చే టూవీలర్ ఏదీ లేదు. టీవీఎస్ ఎక్స్ ఎల్ మోపెడ్ మాత్రమే వస్తుంది. అంటే ఆ వాహనానికి మాత్రమే తొమ్మిది శాతం పన్ను. మిగతా అన్ని వాహనాలకు 12 శాతం పన్ను వసూలు చేస్తారు. ఒక్కో వాహనంపై కొత్తగా కొనేవారికి రూ.3 వేలు అదనపు భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో కొత్తగా బైక్‌లు కొనేవారికి అదనపు భారంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news