క్యాసీనో కేసులో ఈడి ముందు హాజరైన తలసాని సోదరులు

-

క్యాసినో, మనీలాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి ) మరింత దూకుడు కనబరుస్తోంది. ఈ కేసు విచారణలో ఏడి అధికారులు స్పీడ్ పెంచారు. నేడు ఈడి ముందుకు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్ హాజరైనట్టుగా తెలుస్తోంది.

క్యాసినో, హవాలా కేసులో ఆరోపణలపై ఇరువురిని ఈడి ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారం పైన విచారణ జరుగుతుంది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీలపై ఈడి వీరిద్దరిని విచారిస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను ఈడి పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. నేపాల్ లో జరిగిన క్యాసినో కి వెళ్లిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఎవరు అనేది కూపి లాగుతున్నారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version