ధర్నా ట్రైలర్‌ మాత్రమే… ముందు ముందు సినిమా చూపిస్తాం : తలసాని

-

బీజేపీ పార్టీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ ధర్నా ట్రయిలర్ మాత్రమే… ముందు ముందు సినిమా చూపిస్తామని బీజేపీకి వార్నింగ్‌ ఇచ్చారు. ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగములో ఉందని నిలదీశారు మంత్రి తలసాని. నిన్న బుద్ధి లేకుండా బీజేపీ నేతలు ధర్నాలు చేశారని… తెలివి లేకుండా కేంద్రం డ్రామాలు ఆడుతుందని ఫైర్‌ అయ్యారు మంత్రి తలసాని.

బిజెపి పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని… కేంద్ర ప్రభుత్వం దొంగ, నల్ల చట్టాలు తెస్తుందని నిప్పులు చెరిగారు. తెలంగాణ లో పండిన ధాన్యం కేంద్రం కొనుగులు చేస్తుందని కిషన్ రెడ్డి లేఖ ఇప్పించాలని సవాల్‌ విసిరారు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ధర్నాలు చేసామని, కానీ ఈ రోజు దుక్కి దున్నే రైతన్నల కోసం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం పని చేస్తున్నారని గుర్తు చేశారు తలసాని.

Read more RELATED
Recommended to you

Latest news