అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన నటుడు ప్రభు

-

ప్రముఖ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయణ్ను చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు లేజర్​ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రభు ఇటీవలే విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన వారిసు చిత్రంలో నటించారు. తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో హీరోగా కనిపించారు. ప్రస్తుతం సహాయ నటుడి పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. తెలుగులోప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో హీరో తండ్రిగా ప్రభు నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనూ కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news