చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ దర్శకుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

డైరెక్టర్ మణి నాగరాజు గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నేతాండి వరుసవాయ చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ కుమార్, శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ప్రస్తుతం వాసువిన్ కర్పైణేగన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స్థానిక పలసరవాక్కంలో నివాసం ఉంటున్న ఆయన గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నాగరాజు మృతి చిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురి చేసిందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news