బైరాన్ పల్లిని టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తా – గవర్నర్ తమిళి సై

-

బైరాన్ పల్లిని టూరిస్ట్ ప్లేస్ గా మారుస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రకటించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. బైరాన్ పల్లి గ్రామం నిజంగా వీర బైరాన్ పల్లి అని తెలిపారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ను కలవడం సంతోశంగా ఉందని వెల్లడించారు.

రాజ్ భవన్ కి అఖిల అనే అమ్మాయి రావడంతో నాకు విషయం తెలిసిందని.. ఈ గ్రామాన్నీ టూరిస్ట్ ప్లేస్ గా చేయాడానికి కృషి చేస్తానని వివరించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతానని వెల్లడించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కి పెన్షన్ రావడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news