“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని

-

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తొడగొట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా బూరుజి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకి ఎదురైన ఓ అనుభవాన్ని వివరిస్తూ.. ఓ మహిళ మళ్లీ జగన్ కే ఓటేస్తామని తొడగొట్టి చెప్పిందన్నారు.

ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తొడగొట్టి చూపించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ప్రజలు అందుకే గత ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పారని విమర్శించారు. మళ్లీ జగన్ కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళతోడ కొట్టి చెప్పిందని ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తొడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news