ఘరానా మోసం.. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని..

-

కాదేది మోసానికి అనర్హం అన్నట్లు.. ఒకరి అవకాశాన్ని మరోకరి అవకాశంగా మలుచుకొని.. డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వారిని ముగ్గిరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హన్మకొండలోని సుబేదారి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో అడిషనల్‌ డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌ నిందితుల వివరాలు వెల్లడించారు. వరంగల్‌ నగరానికి చెందిన ఎండీ ఇర్ఫాన్‌, ఎండీ అర్షద్‌ పాషా, ఎండీ ఖాసిం లు దుబాయ్‌లోని పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. వారిని దుబాయ్‌కి పంపి అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించారని ఆయన ఆయన వెల్లడించారు.

What you need to know about inter-state arrest - iPleaders

మూడు నెలల తర్వాత ఎటువంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. అర్షద్‌, ఖాసింను నిలదీయడంతో ఇండియాకు పంపించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బాధితులను తీవ్రంగా హెచ్చరించారు నిందితులు. అంతేకాకుండా బాధితుల సర్టిఫికెట్లతో అర్షద్‌, ఖాసిం లు బ్యాంకు ఖాతాలు తీసి లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఈ విషయం బాధితులకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం నగరంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 1.50 లక్షల నగదు, నకిలీ కాల్‌ లెటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లే వారు ఏజెంట్ల పూర్వాపరాలు తెలుసుకోవాలని వైభవ్‌గైక్వాడ్‌ సూచించారు. కేసులో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్‌ సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్‌, ఎస్సై ప్రేమానందం, సిబ్బందిని ఆయన అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news