ట్యాక్సీ డ్రైవర్‌కు జాక్ పాట్.. లాటరీలో రూ.40 కోట్లు!

-

అబుదాబి: కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అంటారు. అప్పుడే చేసిన పనికి అర్థముంటుందని చెబుతారు. అలాంటి అదృష్టం ట్యాక్సీ డ్రైవర్ తలుపులు తట్టింది. దాంతో ఆయన కోటీశ్వరుడు కాబోతున్నాడు. అయితే అతడు కేరళవాసి కావడం విశేషం.

డబ్బు
డబ్బు

టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ కొంతకాలం క్రితం కేరళ నుంచి అబుదాబి వెళ్లాడు. 2008 నుంచి అక్కడ ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు మరో 9 మంది స్నేహితులు కూడా ఉన్నారు. వీరికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఇటీవల కాలంలో వీరంతా కలిసి 100 దిర్హమ్‌లు పోగుచేసి ఓ లాటరీ టికెట్ కొన్నారు. ఎప్పటిలాగే ఈ లాటరీకి కూడా ప్రైజ్ రాలేదని అనుకున్నారు. మరో లాటరీని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సమయంలో వీరికి జాక్ పాట్ తగిలింది. లాటరీ నిర్వాహకులు తాజాగా నిర్వహించిన డ్రాలో రెంజిత్ సోమరాజన్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు వచ్చినట్లె తెలిపారు. ఈ మొత్తం భారత్ కరెన్సీలో రూ. 40 కోట్లు. దీంతో సోమరాజన్ ఎగిరిగంతేశారు. మిగిలిన స్నేహితులకు ఈ స్వీట్ నుంచి చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాని చెప్పారు. తన స్నేహితులు భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన వాళ్లని, వచ్చే మొత్తంలో సమానంగా తీసుకుంటామని సోమరాజన్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాటరీ కొంటుంటే తనను ఎగతాళి చేసేవారని, చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం వరిస్తుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news