అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు..

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రతిరోజు నిరసన తెలుపుతున్నారు. అటు వారి నిరసనలను ఖండిస్తూ స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై సభలో చర్చించాలని వారు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ… స్పీకర్ వినడం లేదు. దీంతో చిరాకు చెందిన టిడిపి సభ్యులు ప్రతి రోజు అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్నారు.

ఇక ఇవాళ ప్రశ్నోత్తరాల వేళ అమూలు పై అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం సమాధానం చెబుతూ ఉండగా…. టిడిపి సభ్యులు చిడతలు వాయిస్తూ నిరసన తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా సమాధానాలు చెప్పంది. అమూల్ వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు.

చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై… ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం, ఇంగిత జ్ఞానం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని. టీడీపీ సభ్యులు శాసన సభా గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సభలో విజిల్స్ వేయడం ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news