వైసీపీకి కేసులు ముఖ్యం.. టిడిపికి రాష్ట్రం ముఖ్యం !

-

ట్విట్టర్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడటం వైసిపి చరిత్ర అని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ను రాష్ట్రపతిగా పెడితే మద్దతు ఇచ్చింది అని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కోవింద్ ను పెడితే మద్దతు ఇచ్చింది అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైల్ నుంచి బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారన్నారు.

మళ్ళీ లోపలికి పంపకుండా ఎన్డీయే చుట్టూ తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు. టిడిపి ఆ రోజు ప్రణబ్ కు గాని సంగ్మా కు గాని మద్దతు ఇవ్వలేదని అన్నారు. తటస్తం గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో తేడా వస్తే కేంద్రంలో అధికారం కూడా వద్దనుకొని బయటకు వచ్చిందని చెప్పారు. వైసీపీకి కేసులు ముఖ్యమని అన్నారు. టిడిపికి రాష్ట్రం ముఖ్యమని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news