చంద్రబాబు అరెస్టు.. భువనేశ్వరి కీలక నిర్ణయం

-

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు, మూడు చోట్ల పర్యటనలు ఉండేలా టీడీపీ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్నితిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

Bhuvaneswari kicks off 'Nijam Gelavali' - The Pioneer

భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేశ్ జనంలోకి వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్ట్​తో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్.. ఆయన జైలు నుంచి తిరిగి రాగానే పాదయాత్ర కొనసాగించనున్నారు. అప్పటివరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ‘బాబుతో నేను’ కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల వేగం పెంచాలి.” అని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news