ఈ పథకం పేరు మార్చాలి.. జగనన్న తోడు కాదు.. జగనన్న కబ్జా..!

-

జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు పేరుమార్చి ప్రస్తుతం జగన్ తన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి బీజేపీ టీడీపీ నేతలు అందరూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు జగనన్న తోడు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా వీధి వ్యాపారుల అందరికీ వడ్డీ లేకుండానే పదివేల రుణం అందించేందుకు నిర్ణయించింది.

అయితే ఇటీవల జగన్ సర్కారు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పై టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ భూములనే కాదు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా కబ్జా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ విమర్శించారు టిడిపి నేత పట్టాభిరాం. జగనన్న తోడు పథకం కాదు పేరుమార్చి జగనన్న కబ్జా అని పెడితే బాగుండేది అంటూ విమర్శలు గుప్పించారు. కేంద్రం ఎప్పుడో ప్రవేశపెట్టిన పథకం జగన్ ఇప్పుడు పేరు మార్చి కొత్త రంగులు అద్ది ప్రవేశ పెట్టారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news