అమరావతి ఉద్యమం శాంతియుతంగా వద్దన్న టీడీపీ నేత…!

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అమరావతి ఉద్యమం ఇప్పటితో సమసిపోయేది కాదు అని అన్నారు. గతంలో అమరావతిలో కొన్నివర్గాలకు సమస్యలు ఉంటే ఇప్పుడు అమరావతి సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సృష్టించే సమస్యతో ఈ ఉద్యమం జరుగుతుందని వివరించారు. అమరావతి ఉద్యమంలో కొద్దిమంది మాత్రమే పాల్గోనడం జరుగుతుందని పేర్కొన్నారు.

అమరావతి పరిరక్షణసమితి వారు ఇచ్చే 5K వాక్ కు అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు వారు విడివిడిగా పెడితే అన్ని వర్గాలు వారు ఈ ఉద్యమంకు బలం వచ్చేలా చేస్తోందని పేర్కొన్నారు. మహిళలను ఉత్తేజపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఇటువంటి వారికి మనం శాంతియుతంగా ఉద్యమం చేస్తే కుదరదని అన్నారు. బూతులు మాట్లాడే వారికి అదే విదంగా సమాధానం చెప్పాలని సూచించారు. ఫిక్షన్ టైప్ యాక్టవిటి చేయకపోతే 500 రోజులు ఆయినా అమరావతి ఉద్యమం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news