ఇద్దరు సీఎం లు తోడు దొంగలే

-

కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ మంత్రులు ఉమ్మడి పాలకులతో పాటు ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నేతల మధ్య పరస్పర ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా అన్న కేశినేని.. కేసీఆర్, జగన్‌ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు.

ఎన్నికల ముందు, తర్వాత కేసీఆర్‌, జగన్‌ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలుగు ప్రజలను ఇద్దరు సీఎంలు పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకు జగన్‌ కేసీఆర్‌తో కలిసి డ్రామా ఆడుతున్నారని.. ఏపీ ప్రజలు ఆ డ్రామాలను గమనించలేనంత పిచ్చోళ్లు కాదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బొకేలు ఇచ్చుకుని ఆలింగనాలు చేసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించానన్న కేశినేని .. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరి నాటకాలని స్పష్టమైందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news