బ్రేకింగ్: జగన్ పై టీడీపీ ప్రివిలేజ్ మోషన్

-

సిఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయింది. 3.12.2020న శాసనసభలో జరిగిన పెన్షన్లపై చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి రెడీ అయింది. అక్టోబర్ 2018 నాటికి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వివరాలపై ఫేక్ అంకెలు చెప్పి సభను జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించారని… ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వడానికి టీడీపీ రెడీ అయింది.

జగన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని టిడిపి కోరనుంది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారం ని కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసుని తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం అందిస్తుంది. నిన్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జగన్ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెట్టారు. .

Read more RELATED
Recommended to you

Latest news