ఓ ప్రభుత్వ టీచర్‌కు షాకిచ్చిన విద్యాశాఖ.. ఎందుకంటే..!

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సర్వీసు కండక్ట్ రూల్స్ ను అతిక్రమించాడనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. మధ్యప్రదేశ్ లోని కనస్య జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, రాజకీయాలకు అతీతంగా సాగుతున్న యాత్రలో పాల్గొన్నందుకు ఇలా సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. మధ్యప్రదేశ్ లోని ఆదివాసీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రైమరీ స్కూల్ లో రాజేశ్ కన్నోజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండడంతో రాజేశ్ సెలవు పెట్టి ఈ యాత్రలో పాల్గొన్నాడు.

Rahul Gandhi की 'भारत जोड़ो' यात्रा को झटका, KGF गानों का इस्तेमाल पड़ा  महंगा, कोर्ट ने लगा दिया ट्विटर हैंडल पर बैन| Zee Business Hindi

నవంబర్ 24న రాహుల్ గాంధీని కలిసి తను వేసిన పెయింటింగ్స్ ను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్ గా మారడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ప్రొఫెషనల్ కండక్ట్ రూల్స్ అతిక్రమించారంటూ రాజేశ్ కు నోటీసులు పంపించారు. ఆపై విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news