ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ !

-

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మరోసారి భేటీ కానుంది. ఆగస్టు 1న అంటే ఆదివారం రోజున ప్రగతి భవన్ లో తెలంగాణ క్యాబినెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశం ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటల ఆ సమయంలో ప్రారంభం కానుంది.

ఈ కేబినెట్ సమావేశానికి తెలంగాణ మంత్రులతో పాటు వ్యవసాయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొననున్నారు. ఇక ఈ క్యాబినెట్ లో కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం … అందుతోంది.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలు, పంట నష్టం, కృష్ణా జలాలు, దళిత బంధు పథకం అమలు, భూముల అమ్మకం, చేనేత కార్మికుల పథకానికి సంబంధించిన పలు అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సినిమా థియేటర్ల ఓపెనింగ్ మరియు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ క్యాబినెట్ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాబినెట్ అనంతరం హుజూరాబాద్ ఎన్నికపై పార్టీ నేతలతో కెసిఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news